నంద్యాలలో కరోనాతో ఎస్బీఐ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2020-07-05T14:27:19+05:30 IST
నంద్యాలలో కరోనాతో ఎస్బీఐ ఉద్యోగి మృతి
కర్నూలు: నంద్యాలలో కరోనాతో ఎస్బీఐ ఉద్యోగి మృతి చెందాడు. మృతుడు శిరువెళ్ల మండలం ఎర్రగుంట్లలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగి మృతితో అతడి కాంటాక్ట్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్బీఐ ఉద్యోగి కరోనాతో మృతి చెందడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.