రేపు నల్సార్‌ యూనివర్సిటీకి సీజేఐ రాక

ABN , First Publish Date - 2021-12-18T01:41:32+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈనెల 19న(రేపు) మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న నల్సార్‌ యూనివర్సిటీని

రేపు నల్సార్‌ యూనివర్సిటీకి సీజేఐ రాక

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈనెల 19న(రేపు) మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న నల్సార్‌ యూనివర్సిటీని సందర్శించనున్నారు. ముందుగా వరంగల్‌ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం నల్సార్‌ యూనివర్సిటీకి రానున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో రూ.25 కోట్లతో నిర్మించిన బాలుర, బాలికల వసత గృహాలతో పాటు డైనింగ్‌ హాల్‌ను ప్రారంభించి, అనంతరం జరిగే కన్వెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 20వ తేదీన ఉదయం సీజేఐ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ తరలివెళ్లనున్నారు.

Updated Date - 2021-12-18T01:41:32+05:30 IST