న్యాయం కోరితే ఎదురు దాడి చేస్తారా?: నాగోతు
ABN , First Publish Date - 2020-10-18T09:05:54+05:30 IST
న్యాయం కోరితే ఎదురు దాడి చేస్తారా?: నాగోతు
అమరావతి: ప్రతిపక్షాలే కాదు.. రిటైర్డ్ ఐపీఎ్సలు న్యాయం అడిగినా రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల కన్నా వేగంగా ఎదురుదాడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్నాయుడు అన్నారు. అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయాలని ఓ మాజీ ఐపీఎస్ అధికారి అడిగినా తప్పేనా? అంటూ తిరుపతి పాస్టర్ విషయంలో పోలీసుల తీరును ప్రశ్నించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్విట్ను నాగోతు ఉటంకిచారు.