నాదెండ్ల మనోహర్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్న కూలీలు

ABN , First Publish Date - 2021-08-28T18:31:41+05:30 IST

బెంజ్ సర్కిల్ లోని కూలీల అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. అడ్డా దగ్గరే భవన నిర్మాణ కార్మికులతో కలిసి టీ తాగుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.

నాదెండ్ల మనోహర్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్న కూలీలు

విజయవాడ: బెంజ్ సర్కిల్ లోని కూలీల అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. అడ్డా దగ్గరే భవన నిర్మాణ కార్మికులతో కలిసి టీ తాగుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. రెండేళ్లుగా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. రోజూ 400 మంది పనుల కోసం వస్తుంటే నలభై - యాభై మందికి కూడా పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని లేక కూడా వట్టి చేతులతో ఇంటికి పోవాల్సి వస్తోందని కూలీలు కన్నీరు పెట్టారు. కన్నబిడ్డల కడుపు నింపలేక పోతున్నామని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్లే ఈ కష్టాలు అని చెప్పిన నాదెండ్ల మనోహర్‌కు కూలీలు తెలిపారు.

Updated Date - 2021-08-28T18:31:41+05:30 IST