కార్మికులు చేపట్టే ధర్నాకు జనసేన మద్దతు: నాదెండ్ల
ABN , First Publish Date - 2021-07-27T21:22:17+05:30 IST
కార్మికులు చేపట్టే ధర్నాకు జనసేన మద్దతు: నాదెండ్ల
అమరావతి: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సంక్షేమ నిధి సాయం 2.3 లక్షల దరఖాస్తులను పెండింగ్లో ఉంచారని చెప్పారు. ఇప్పటికీ ఇసుక కొరతతో భవన నిర్మాణదారులకు కష్టాలు తప్పలేదని చెప్పారు. ఆగస్టు 5న భవన నిర్మాణ కార్మికులు చేపట్టే ధర్నాకు జనసేన మద్దతు ఇస్తుందన్నారు. 30 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని తెలిపారు. సంక్షేమ బోర్డు నిధులను ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.