TS News: మునుగోడు బరిలో బీఎస్పీ: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-08-07T01:36:01+05:30 IST

మునుగోడు (Munugodu) ఉపఎన్నికల బరిలో బీఎస్పీ (BSP) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

TS News: మునుగోడు బరిలో బీఎస్పీ: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

చౌటుప్పల్‌: మునుగోడు (Munugodu) ఉపఎన్నికల బరిలో బీఎస్పీ (BSP) పోటీ చేస్తుందని ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ (Praveen Kumar) ప్రకటించారు. చౌటుప్పల్‌లో శనివారం నిర్వహించిన బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2లక్షలకు పైగా బలహీనవర్గాల ఓటర్లు ఉన్న మునుగోడు నియోజకవర్గంలో 50 సంవత్సరాల నుంచి ఒక్క బలహీనవర్గాలకు చెందిన ఒక వ్యక్తి కూడా ఎమ్మెల్యే లేకపోవడం శోచనీయమన్నారు. 10శాతం మాత్రమే ఉన్న ఆధిపత్యవర్గాల చేతిలోనే ఇంకా మునుగోడు ప్రాంతం బందీ అయిందని అన్నారు. ప్రజలు అడగకుండానే ఇంకా 18నెలల పదవీకాలం మిగిలి ఉన్న రాజగోపాల్‌రెడ్డి తన పదవికి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. తన ఈగో కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఉప ఎన్నికలతో ప్రజలపై పెనుభారం పడనుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆధిపత్య పార్టీలు బీజేపీ, టీఆర్‌ఎస్‌, (BJP TRS) కాంగ్రెస్‌లు ఉప ఎన్నికను తెరపైకి తెచ్చాయన్నారు. మునుగోడులో దోపిడీ పార్టీలను ఓడించడానికి బహుజనులు సన్నద్ధం కావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-07T01:36:01+05:30 IST