TS NEWS: మునుగోడు ఉపఎన్నిక కాబట్టే గిరిజన బంధు: లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-09-26T02:40:01+05:30 IST
మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by-election) వచ్చింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధుపథకం తీసుకు వచ్చిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ (LAXMAN) అన్నారు.
నల్లగొండ(Nalgonda): మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by-election) వచ్చింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధుపథకం తీసుకు వచ్చిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ (LAXMAN) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు గాలికొదిలేసే అలవాటు కేసీఆర్దన్నారు. టీఆర్ఎస్ (TRS) ఓడితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని మునుగోడులో టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో పరుగెడుతుందన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని లక్ష్మణ్ అన్నారు.