Mulugu: రోడ్డుపై నిలబడ్డ వారిపై దూసుకెళ్లిన ఆటో

ABN , First Publish Date - 2022-02-09T14:06:56+05:30 IST

జిల్లాలోని జంగాలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలబడి ఉన్న ముగ్గురిపైకి వేగంగా వచ్చిన ఆటో దూసుకెళ్లింది.

Mulugu: రోడ్డుపై నిలబడ్డ వారిపై దూసుకెళ్లిన ఆటో

ములుగు: జిల్లాలోని జంగాలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలబడి ఉన్న ముగ్గురిపైకి ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆటోతో సహా డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-09T14:06:56+05:30 IST