Mulugu: ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-09-08T12:57:27+05:30 IST

ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు నిర్వహించడంతో ఐదుగురు ఉపాధ్యాయులకు

Mulugu: ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం

ములుగు: ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు నిర్వహించడంతో ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా వైద్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూల్స్ కు పంపాలంటేనే భయపడుతున్నారు.

Updated Date - 2021-09-08T12:57:27+05:30 IST