ధోనీ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే: అజయ్ రాత్రా

ABN , First Publish Date - 2020-05-25T16:51:33+05:30 IST

టీం ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్

ధోనీ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే: అజయ్ రాత్రా

టీం ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయినా.. ధోనీని మైదానంలో చూస్తామని అభిమానులు భావించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ రద్దు కావడంతో అదీ జరగలేదు. అయితే ఐపీఎల్ జరగకపోతే.. ధోనీ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని టీం ఇండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అజయ్ రాత్రా అన్నారు. 


‘‘ధోనీ అనూహ్యమైన ఆటగాడు.. కానీ, చాలాకాలంగా అతను క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు. ఐపీఎల్ 2020 అతని అంతర్జాతీయ కెరీర్‌కి నిర్ణయాత్మకంగా ఉండేది. టీం మేనేజ్‌మెంట్ అతని ప్రదర్శనని క్షుణ్ణంగా పరిశీలించి.. అతని భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకొని ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఐపీఎల్ తాత్కాలికంగా రద్దు అయింది. దీంతో ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారింది’’ అని రాత్రా అన్నారు. 

Updated Date - 2020-05-25T16:51:33+05:30 IST