కేంద్రమంత్రి నిర్మలతో విజయసాయిరెడ్డి భేటీ
ABN , First Publish Date - 2021-07-24T01:10:17+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ను వైసీపీ ఎంపీ
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని నిర్మలకు ఆయన విజ్ఞప్తి చేసారు.ఆంధ్రుల మనోభావాలతో స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ కారణంగానే విశాఖ మహానంగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరంగా ఉందన్నారు.
నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సొంత గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని నిర్మలా సీతారామన్తో విజయసాయిరెడ్డి అన్నారు.