ఎంపీ సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసలు

ABN , First Publish Date - 2020-08-12T03:04:58+05:30 IST

ఎంపీ సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసలు

ఎంపీ సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసలు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ల కృషి ఫలించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను నెటిజెన్లు పొగత్తలతో ముంచెత్తారు. ట్విట్టర్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దూసుకుపోతోంది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 2వ స్థానంలో ఉంది. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్విట్లతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దూసుకెళ్తోంది. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశేష అవగాహన కల్పిస్తోంది. 74.7కే ట్విట్లతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దూసుకెళ్తోంది.



Updated Date - 2020-08-12T03:04:58+05:30 IST