కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ రేవంత్ ట్వీట్

ABN , First Publish Date - 2021-05-12T22:37:03+05:30 IST

మల్కాజ్‌గిరి కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలంటూ మాల్కాజ్‌గిరి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ రేవంత్ ట్వీట్

హైదరాబాద్: మల్కాజ్‌గిరి కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలంటూ మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు రేవంత్ బుధవారం కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీగా, ఓ ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతగా కంటోన్మెంట్ బొల్లారం ప్రాథమిక ఆరోగ్ కేంద్రాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశామి, నియోజకవర్గంలోని కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని 15 రోజుల క్రితమే నిర్ణయించామని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా చురుగ్గానే సాగుతున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం అత్యంత కీలకమని, పీఎం కేర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి, డీఆర్‌డీవో చైర్మన్‌కు కూడా లేఖలు రాసినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ట్విట్టర్ వేదికగా రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. 

Updated Date - 2021-05-12T22:37:03+05:30 IST