18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై ఎంపీ రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-07-13T14:26:14+05:30 IST

18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై ఎంపీ రఘురామ లేఖ

న్యూఢిల్లీ: 18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై  ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దేశంలో విశృంఖలంగా పెరుగుతున్న కరోనా రెండో వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించిందని అన్నారు. ఇలా కేంద్రం ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందచేయడం ప్రారంభం కాలేదన్నారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే యవతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని అన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారని తెలిపారు. రాష్ట్రానికి అప్పులిచ్చేవారు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదన్నారు. కనీసం మంచి వైద్యులైనా ఇక్కడ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్‌, ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా..తగిన అనుభవం లేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని...తెలంగాణ వైద్యుల నియామకం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా పక్క రాష్ట్రాల వైద్యులను కాకుండా..ఏపీ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని  రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-13T14:26:14+05:30 IST