విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...: Raghurama
ABN , First Publish Date - 2022-01-10T19:09:09+05:30 IST
ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. సచివాలయ ఉద్యోగులకు తన మద్దతును తెలియజేశారు. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి.. ప్రజల కష్టాలు చూడాలని హితవుపలికారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని తెలిపారు. జగన్ మొద్దునిద్ర వదిలి ఉద్యోగుల ఆందోళనలు చూడాలని సూచించారు. భీమిలి ఎంఆర్వో ఉద్యోగులను బెదిరిస్తున్నారని... ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.