‘ఏపీ అప్పులకు ఆ పత్రికలో రాతలకు పొంతన లేదు’
ABN , First Publish Date - 2022-07-26T23:43:58+05:30 IST
ఏపీ అప్పులు, సాక్షిలో రాతలకు పొంతన లేదని ఎంపీ రఘురామ అన్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
అమరావతి: ఏపీ అప్పులు, సాక్షిలో రాతలకు పొంతన లేదని ఎంపీ రఘురామ అన్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రూ.87 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు ఏపీ ఒప్పుకుందన్నారు. లిక్కర్, సాక్షికి డబ్బు ఇవ్వడం కాదని, అప్పులు ఇచ్చిన వారికి కూడా ఇవ్వాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8 లక్షల కోట్లని పేర్కొన్నారు. అప్పులపై ఢిల్లీలో ఎక్కడ చర్చిద్దామో చెప్పండన్నారు. తమ పార్టీ సర్వేలో తమకు 40 సీట్లు మించి రావడం లేదన్నారు. కర్ణాటక పోలీసులు గంజాయి దర్యాప్తుకు ఏపీకి వస్తే యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఏపీలో వాహన ప్రమాదం ఉంది.. జాగ్రత్త అని వ్యాఖ్యానించారు.