సీబీసీఐడీ అధికారిపై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-07-29T02:15:41+05:30 IST
సీబీసీఐడీ అధికారిపై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు
గుంటూరు: ఏపీ సీబీసీఐడీ సునీల్కుమార్పై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ను కీలక పదవి నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. భార్య అరుణ వరకట్నం వేధింపుల కేసులో సునీల్కుమార్పై చార్జ్షీట్ దాఖలైందని, కీలక పదవిలో ఉన్న సునీల్కుమార్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఎంపీ పేర్కొన్నారు. తనను అరెస్టు చేయవద్దని హైకోర్టు నుంచి సునీల్కుమార్ రక్షణ పొందారని ఫిర్యాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.