వైసీపీకి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు: ఎంపీ మిథున్రెడ్డి
ABN , First Publish Date - 2022-01-02T17:12:02+05:30 IST
వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి: వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామన్నారు. టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబునాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదన్నది ప్రభుత్వ యోచన అన్నారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని వ్యాఖ్యానించారు. ‘‘మా కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రేడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయి. బస్సు దోపిడీలాంటి కేసులు కూడా అతనిపై నమోదై ఉన్నాయి.’’ అని ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు.