కరోనా కారణంగా ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది: మిథున్రెడ్డి
ABN , First Publish Date - 2020-04-03T19:42:06+05:30 IST
అమరావతి: ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కి వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి లేఖ రాశారు.
అమరావతి: ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కి వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి లేఖ రాశారు. కరోనాతో దేశంపై 348 మిలియన్ డాలర్ల ప్రభావం పడిందని.. దీని కారణంగా ఏపీ ఖజానా ఖాళీ అయ్యిందని మిథున్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే 8 నుంచి 10 శాతం ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని కోరారు. వ్యాపార, పరిశ్రమల రుణాలపై ఏడాది పాటు మారిటోరియం విధించాలని మిథున్రెడ్డి కోరారు.