పలు అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు
ABN , First Publish Date - 2020-08-08T23:38:41+05:30 IST
పలు అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు
విజయవాడ: పార్లమెంట్ నియోజకవర్గoలో పలు అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు. దాదాపు రూ.37 కోట్ల వ్యయంతో సుమారు 105 కిలోమీటర్ల పొడవు 14 రహదారుల నిర్మాణం పనులకు ఆయన ప్రతిపాదించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎంపీ కేశినేని నాని ఆమోదంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనలు అతి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.