బీజేపీ పోటీ కాదు అనుకుంటే పొరపాటే: ఎంపీ జీవీఎల్

ABN , First Publish Date - 2022-07-06T23:26:04+05:30 IST

రాష్ట్రంలో మోదీ సభ జరిగిన తీరు గతంలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. మోదీ లాంటి నాయకుడిని దశాబ్ధాలుగా ఎవరూ చూడలేదని చెప్పారు.

బీజేపీ పోటీ కాదు అనుకుంటే పొరపాటే: ఎంపీ జీవీఎల్

హైదరాబాద్: రాష్ట్రంలో మోదీ సభ జరిగిన తీరు గతంలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. మోదీ లాంటి నాయకుడిని దశాబ్ధాలుగా ఎవరూ చూడలేదని చెప్పారు. మోదీ ఏపీకి రావాలని అడిగానని.. ఆయన ఏపీకి పలు మార్లు వస్తాను అని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే మోదీ రాష్ట్రానికి మరోసారి రాబోతున్నారని చెప్పారు. బీజేపీ ఫోకస్ తెలుగు రాష్ట్రాలపైన విస్తృతంగా ఉందన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయం దిశగా బీజేపీనే ఉండబోయే విధంగా ఎదుగుతామని వ్యాఖ్యానించారు. బీజేపీ బలోపేతంలో భాగంగా క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటానన్నారు. విశాఖలోనూ త్వరలోనే క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన, అమిత్ షా తిరుపతి రాక, మోదీ సభ ఏపీ లో బలోపేతం దిశగానే అడుగులు పడుతున్నాయన్నారు. బీజేపీ తమకు పోటీ కాదు అనుకుంటే ఆ పార్టీల పొరపాటేనన్నారు. జూలై 10వ తేదీన పదాధికారుల సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 


Updated Date - 2022-07-06T23:26:04+05:30 IST