టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బండి సంజయే..: ఎంపీ అర్వింద్
ABN , First Publish Date - 2021-12-27T22:00:49+05:30 IST
2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
హైదరాబాద్: 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు సిగ్గుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ముఖం పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూర్ల పేరుతో మంత్రి కేటీఆర్ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ మీద ప్రేమ కంటే.. కేసీఆర్కు తన బిడ్డల మీదనే ప్రేమ ఎక్కువనని అన్నారు. పోలీసు అధికారులు సైతం కేసీఆర్ను నానా బూతులు తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు మాత్రమే కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ అర్వింద్ దుయ్యబట్టారు.