లాక్‌డౌన్ మరికొన్ని వారాలు కొనసాగుతుంది.. : ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2020-04-09T17:50:07+05:30 IST

నిజామాబాద్: మరికొన్ని వారాలు లాక్‌డౌన్ కొనసాగుతుందని.. అంతా సహకరించాలని బీజేపీ ఎంపీ అరవింద్ ప్రజలను కోరారు.

లాక్‌డౌన్ మరికొన్ని వారాలు కొనసాగుతుంది.. : ఎంపీ అరవింద్

నిజామాబాద్: మరికొన్ని వారాలు లాక్‌డౌన్ కొనసాగుతుందని.. అంతా సహకరించాలని బీజేపీ ఎంపీ అరవింద్ ప్రజలను కోరారు. తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్ కన్నా మన దగ్గరే కేసులు ఎక్కువగా నమోదవుతుండటం అందోళన కల్గించే అంశమన్నారు. 


రైతులకు గన్ని బ్యాగులు అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అరవింద్ విమర్శించారు. అమెరికాకు మందులు సప్లయ్ చేసే స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లిన మోదీ నాయకత్వంలో పని చేయటం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం చేయల్సిన సమయం ఇదన్నారు. 


కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 


కరోనాపై కేంద్రం ఎప్పటికప్పుడు పార్లమెంటు సభ్యులతో చర్చిస్తోందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-09T17:50:07+05:30 IST