ఎన్హెచ్డీసీని తరలించడం తగదు: రాపోలు
ABN , First Publish Date - 2020-08-13T07:45:35+05:30 IST
హైదరాబాద్లోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్పమెంట్ కార్పొరేషన్(ఎన్హెచ్డీసీ) ప్రధాన
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్పమెంట్ కార్పొరేషన్(ఎన్హెచ్డీసీ) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించడం సరికాదని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రతిష్ఠను తగ్గించడమేనని చెప్పారు. ఈ మేరకు కేంద్ర చేనేత, జౌళి మంత్రి స్మృతీ ఇరానీకి బుధవారం లేఖ రాశారు. తరలింపు వల్ల హ్యాంక్యార్న్తోపాటు ఇతర ముడి సరుకుల కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన తెలిపారు.