పింఛన్‌ సొమ్ము ఇవ్వలేదని తల్లి హత్య

ABN , First Publish Date - 2020-12-03T08:58:57+05:30 IST

పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని కొడుకు దాడి చేయడంతో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ సంఘటన బుధవారం జరిగింది.

పింఛన్‌ సొమ్ము ఇవ్వలేదని తల్లి హత్య

ఏలూరు క్రైం, డిసెంబరు 2: పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని కొడుకు దాడి చేయడంతో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ సంఘటన బుధవారం జరిగింది. ఏలూరులో బెజవాడ ప్రసన్నకుమారి(74) ఆమె కుమార్తె(మానసిక వికలాంగురాలు) కలిసి జీవిస్తున్నారు. కుమారుడు దేవదాసు(50) సమీపంలోనే ఉంటున్నాడు. తల్లీకూతుళ్లకు ప్రతీ నెల వస్తున్న పింఛన్ల సొమ్ము రూ.7,250 ఆధారం. వీరి పెన్షన్‌లో కొంత సొమ్మును దేవదాసు తీసుకువెళ్తూ ఉంటాడు. బుధవారం రాత్రి పెన్షన్‌ సొమ్ము ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వననడంతో చెంపపై కొట్టడంతో తూలి పక్కనే ఉన్న రాయిపై పడి అక్కడికక్కడే మృతి చెందింది.

Updated Date - 2020-12-03T08:58:57+05:30 IST