దుండిగల్‌‌లో కొడుకు సహా తల్లి అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-09T13:34:28+05:30 IST

ఆస్తి వివాదంలో భర్తతో గొడవపడి ఓ ఇల్లాలు కుమారుడిని

దుండిగల్‌‌లో కొడుకు సహా తల్లి అదృశ్యం

హైదరాబాద్/దుండిగల్ ‌: ఆస్తి వివాదంలో భర్తతో గొడవపడి ఓ ఇల్లాలు కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దుండిగల్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని భౌరంపేట్‌ ఇందిరమ్మకాలనీలో నివాసముండే వేణుబాబు, సౌజన్య(23) భార్యాభర్తలు. వీరికి కుమారుడు మనోజ్‌(4) ఉన్నాడు. కొంతకాలంగా ఓ ప్లాట్‌ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో ఈ నెల 7న భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత సౌజన్య కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. దుండిగల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-09T13:34:28+05:30 IST