మూన్లైటింగ్.. విప్రోలో 300 మంది అవుట్
ABN , First Publish Date - 2022-09-22T06:34:11+05:30 IST
ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లుగా (మూన్లైటింగ్) గుర్తించిన 300 మంది సిబ్బందికి విప్రో ఉద్వాసన పలికింది.
న్యూఢిల్లీ: ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లుగా (మూన్లైటింగ్) గుర్తించిన 300 మంది సిబ్బందికి విప్రో ఉద్వాసన పలికింది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 300 మంది ఏకకాలంలో తమ ప్రత్యర్థి కంపెనీల కోసమూ పని చేస్తున్నట్లుగా గత కొన్ని నెలల్లో గుర్తించడం జరిగిందని విప్రో చైర్మన్ రిష ద్ ప్రేమ్జీ బుధవారం వెల్లడించారు.