దేశాన్ని పాలించే హక్కు మోదీకి లేదు: నారాయణ
ABN , First Publish Date - 2022-01-09T01:40:39+05:30 IST
తనను చంపడానికి యత్నిస్తున్నారంటూ దేశ ప్రధాని మోదీ చెప్పడం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు
తిరుపతి: తనను చంపడానికి యత్నిస్తున్నారంటూ దేశ ప్రధాని మోదీ చెప్పడం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తనకు భద్రతలేదని చెప్పుకుంటున్న మోదీ దేశ ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారని, దేశాన్ని పాలించే నైతిక హక్కు లేని ఆయన తక్షణం వైదొలగాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గుజరాత్ ఎన్నికల సందర్భంగా తనను చంపడానికి సుపారీ ఇచ్చారంటూ సానుభూతి కోసం ప్రయత్నించారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం కోసం పంజాబ్ పర్యటనలో జరిగిన ఘటనను మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే మోదీకి స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న అనంతరం మళ్లీ ఆందోళన చేస్తారా అని నారాయణ ప్రశ్నించారు.