మోదీ నేతృత్వంలో స్వావలంబన భారత్: పవన్
ABN , First Publish Date - 2020-05-31T09:24:25+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విటర్లో స్పందించారు. ‘‘ఏడాది పాలనలో ఎన్నో చారిత్రాత్మక, చిరస్మరణీయ నిర్ణయాలను దేశం యావత్తూ వీక్షించింది.
ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విటర్లో స్పందించారు. ‘‘ఏడాది పాలనలో ఎన్నో చారిత్రాత్మక, చిరస్మరణీయ నిర్ణయాలను దేశం యావత్తూ వీక్షించింది. త్వరలోనే మన దేశం స్వావలంబన భారత్గా అవతరించబోతోంది. ముందుచూపు, సాహసం కలగలిసిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్దే అవుతుంది. ఈ ఏడాది పాలనలో విజయవంతమైన సంస్కరణలను తీసుకురావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పవన్ ట్వీట్ చేశారు.