మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ మోసగాళ్లే: షర్మిల

ABN , First Publish Date - 2022-02-15T02:03:39+05:30 IST

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మోసగాళ్లేనని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ మోసగాళ్లే: షర్మిల

హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మోసగాళ్లేనని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దెయ్యాలు దేశాన్ని పాలిస్తుంటే.. భూతాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని దుయ్యబట్టారు. కేసీఆర్‌ మొన్నటివరకు బీజేపీతో కలిసి తిరిగారని విమర్శించారు. ఇప్పుడు దుష్మన్ డ్రామాలు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ‘‘బీజేపీ అవినీతి మా దగ్గర ఉందని టీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌ అవినీతి మా దగ్గర ఉందని బీజేపీ దొంగ డ్రామాలు ఆడుతున్నాయి. ప్రజలను తప్పుదోవ, సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీ రక్తంలో ఉంది. మోదీ వల్ల దేశానికి, కేసీఆర్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు’’ అని షర్మిల దుయ్యబట్టారు.

Updated Date - 2022-02-15T02:03:39+05:30 IST