ప్రజలహక్కులపై మోదీ ప్రభుత్వం దాడి: చాడ
ABN , First Publish Date - 2021-03-08T07:55:21+05:30 IST
దేశంలోని ప్రజల హక్కులపై మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 7: దేశంలోని ప్రజల హక్కులపై మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఉపాధిహామీ కూలీల సమస్యలపై ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.