ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. విషయం ఏంటంటే!
ABN , First Publish Date - 2020-04-05T02:00:15+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాణాంతక వైరస్ కాటుకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 61వేల మంది మరణించారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాణాంతక వైరస్ కాటుకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 61వేల మంది మరణించారు. సుమారు 11లక్షల మంది మహమ్మారి బారినడపడ్డారు. అగ్రరాజ్యమైన అమెరికాపై కూడా కొవిడ్ పంజా విసురుతోంది. అమెరికాలో నమోదైనన్ని కరోనా కేసులు.. ఇతర ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. ఇటు భారత్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం అమెరికా అధ్యక్షుడితో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనాపై పోరాటానికి సర్వశక్తులు ఒడ్డేందుకు ఇరు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు ప్రధాని తెలిపారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 7400 మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు.