సింధు, లక్ష్యసేన్కు ‘ఎంఓసీ’ సహకారం
ABN , First Publish Date - 2022-05-27T09:41:18+05:30 IST
స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ కోరిన సహాయాన్ని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) కమిటీ సభ్యులు గురువారం ఆమోదించారు.
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ కోరిన సహాయాన్ని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) కమిటీ సభ్యులు గురువారం ఆమోదించారు. సింధు వచ్చే రెండు నెలల్లో ఆడబోయే టోర్నమెంట్లకు తనతో పాటు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ ఎం.శ్రీకాంత్ను కూడా వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. అలానే అతడి కయ్యే ఖర్చులను భరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వరల్డ్ నెం.1 ఆక్సెల్సన్తో కలిసి దుబాయ్లో సాధన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా లక్ష్యసేన్ కోరాడు. అలానే కౌలాలంపూర్లో జూన్ 19 నుంచి 26 వరకు సాధన చేసేందుకయ్యే ఖర్చులతో పాటు తన వెంట తీసుకెళ్లనున్న ఫిజియో ఖర్చులను కూడా భరించాల్సిందిగా లక్ష్యసేన్ విజ్ఞప్తి చేశాడు.