సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు
ABN , First Publish Date - 2022-02-21T23:56:08+05:30 IST
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణం చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణం చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎం ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ కి ఆ నలుగురు ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.