సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
ABN , First Publish Date - 2021-10-19T04:50:36+05:30 IST
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి
కమలాపూర్, అక్టోబరు 18 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సోమవారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్కేర్ సెలవులు ఇప్పించడం జరిగిందన్నారు. అలాగే మోడల్ స్కూల్ సిబ్బందికి 30 శాతం ఫిట్మెంట్ జీవో విడుదల చేయించామన్నారు. త్వరలోనే కేజీబీవీ సి బ్బందికి సైతం 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. సీఆర్పీలకు ఎఫ్టీఏ లాంటి ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జనార్దన్రెడ్డి, శ్రీపాల్రెడ్డిలను ఉ పాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు కె.అనురాధ, శ్రీనివా్సరెడ్డి, ప్రకాష్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, పీవీజీ కృష్ణ, సంపత్రావు, సాయిలత, ప్రభాకర్రెడ్డి, అర్చన, సుభాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.