Telangana: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-10T13:31:26+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

Telangana: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు స్థానాలకు  26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగుతుండగా... కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. ఎన్నికల కోసం అధికారులు 37 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated Date - 2021-12-10T13:31:26+05:30 IST