ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం: Dokka
ABN , First Publish Date - 2022-02-03T18:00:30+05:30 IST
భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారని... ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు.
గుంటూరు: భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారని... ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదమన్నారు. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దన్నారు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని... జిన్నా గొప్ప న్యాయవాది అని డొక్కా మాణిక్యవర ప్రసాద్ కొనియాడారు.