నీటి పారుదల మంత్రులు నోరు పారేసుకుంటారు కానీ..: ఎమ్మెల్యే వాసుపల్లి

ABN , First Publish Date - 2020-05-23T19:56:27+05:30 IST

విశాఖ: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ ధ్వజమెత్తింది. ఏడాది కాలంలో కోర్టులు 63 మొట్టికాయలు వేసిందంటే..

నీటి పారుదల మంత్రులు నోరు పారేసుకుంటారు కానీ..: ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖ: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ ధ్వజమెత్తింది. ఏడాది కాలంలో కోర్టులు 63 మొట్టికాయలు వేసిందంటే.. జగన్ పాలన అర్థమవుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. వైసీపీలో నీటి పారుదల మంత్రులు నోరు పారేసుకుంటారు కానీ... పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ మీద నోరు విప్పడం లేదన్నారు. వైసీపీ సంవత్సర కాల పాలనపై ప్రజల గండం గడిచింది అనుకుంటున్నారన్నారు. గడిచిన ఏడాదిలో ఒక విజన్, పాలన లేదని వాసుపల్లి విమర్శించారు. అందుకే జగన్ రాజీనామా చేయాలన్నారు. ప్రధాని మోదీ జెమిలి ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ, టీడీపీ బలాబలాలు తేలిపోతాయన్నారు. అమరావతి అంటే చౌదరి రాజ్యమని జగన్ అండ్ కో అంటారని... కానీ అక్కడ ఉన్నదంతా దళితులేనని ఎమ్మెల్యే వాసుపల్లి విమర్శించారు.


Updated Date - 2020-05-23T19:56:27+05:30 IST