మేడారంకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: MLA Seethakka

ABN , First Publish Date - 2022-02-18T18:44:25+05:30 IST

ఇద్దరు అమ్మవార్లు సారలమ్మ, సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో మేడారంలో భక్తుల కోలాహలం నెలకొంది.

మేడారంకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: MLA Seethakka

మేడారం: ఇద్దరు అమ్మవార్లు సారలమ్మ, సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో మేడారంలో భక్తుల కోలాహలం నెలకొంది. లక్షలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని ఎమ్మెల్యే సీతక్క ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడారంకు రానున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీతక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గతంలో మేడారం అభివృద్ధి కోసం రూ. 2 వందల కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అలాగే ఆలయ విస్తరణ కోసం 2 వందల ఎకరాల భూసేకరణ చేస్తామన్నారని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని కోరారు. దేవుడికి ఇచ్చిన మాట కాబట్టి ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సమ్మక్క, సారలమ్మ జిల్లాగా ములుగుకు నామకరణం చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం ఇస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2022-02-18T18:44:25+05:30 IST