‘భగీరథ’ లీకేజీ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-04-16T05:53:27+05:30 IST

‘భగీరథ’ లీకేజీ పనులు పూర్తి చేయాలి

‘భగీరథ’ లీకేజీ పనులు పూర్తి చేయాలి
మరిపెడలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స రెడ్యానాయక్‌ 

మరిపెడ, ఏప్రిల్‌ 15 : మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ పనులను పది రోజుల్లోపు పూర్తి చేసి తాగునీటి కొరత లేకుండా చూడాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో గురువారం మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల మిషన్‌ భగీరథ పెండింగ్‌ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని వెంకటియాతండా, గుర్రపతండా, నూనావత్‌తండాల్లో తాగునీటి సమస్య ఉందని, ఈసమస్యపై గత సమీక్ష సమావేశంలో అధికారులు పది రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆ పనులు అలాగే పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పైపు లైన్‌ పనులను ఎవరైనా అడ్డుకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి నవీన్‌రావు, జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ గుగులోత్‌ అరుణరాంబాబు, జడ్పీటీసీ తేజావత్‌ శారదరవీందర్‌నాయక్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ సింధూరరవికుమార్‌, వైస్‌చైర్మన్‌ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-04-16T05:53:27+05:30 IST