మంత్రి కేటీఆర్‌ని కలిసిన ఎమ్మెల్యే రమేష్

ABN , First Publish Date - 2021-08-11T02:10:11+05:30 IST

మంత్రి కేటీఆర్‌ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మంగళవారం కలిశారు.

మంత్రి కేటీఆర్‌ని కలిసిన ఎమ్మెల్యే రమేష్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపైన మంత్రికి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై  మంత్రి కేటీఆర్ సమీక్షించి పట్టణ అభివృద్ధికి పరిపాలన అనుమతులు ఇచ్చారని చెప్పారు. 20 కోట్ల పనులను ప్రారంభించడానికి కేటీఆర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను త్వరలోనే విడుదల చేస్తారని మంత్రి తెలిపారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కి ఎమ్మెల్యే రమేష్ ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-08-11T02:10:11+05:30 IST