ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా
ABN , First Publish Date - 2022-01-20T06:10:05+05:30 IST
ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా
కృష్ణకాలనీ (భూపాలపల్లి), జనవరి 19: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కరోనా బారిన పడ్డారు. కొంత కాలంగా భూపాలపల్లి నియోజకవర్గంలో వారిద్దరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆలయాల్లో పూజలు, రైతుబంధు సంబరాలకు హాజరయ్యారు. రేగొండ మండలం చెన్నాపూర్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం పర్యటించగా వారి వెంట గండ్ర దంపతులు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో మంత్రులతో హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం దగ్గు, జలుబు, జ్వరం ఉండ టంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్లోని తమ నివాసంలో హోంక్వారంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ వెంట ఉన్న నియో జకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా కొవిడ్ పరీక్షలు చేయిం చుకోవాలని గండ్ర దంపతులు సూచించారు.