వారం రోజులైనా బర్రెలు దొరకలేదు: ఈటెల
ABN , First Publish Date - 2021-12-05T02:42:09+05:30 IST
ఏదో బర్రెల స్కీమ్ పెట్టి హర్యానాకు పంపిస్తే వారం రోజులైనా బర్రెలు
సూర్యాపేట: ఏదో బర్రెల స్కీమ్ పెట్టి హర్యానాకు పంపిస్తే వారం రోజులైనా బర్రెలు దొరకలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో ఈటెల మీడియా సమావేశంలో మాట్లడారు. హుజురాబాద్లో దళితబందు పథకాన్ని నవంబర్ 4నే అమలు చేస్తానన్న సీఎం కేసీఆర్ డిసెంబర్ 4 వచ్చినా చేయలేదన్నారు. దళితబందును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకపోతే దళితులు ప్రగతి భవన్ ముందు చావు డప్పు మోగిస్తారన్నారు. దళితబంధు విధివిధానాలను ఇప్పటివరకూ ఖరారు లేదన్నారు. ఏం చేయబోతున్నారో, ఏం ఇవ్వబోతున్నారో, ఏం చేయాలో చెప్పే పరిస్థితి లేదన్నారు. గేదెల స్కీమ్ పెట్టి హర్యానాకు పంపిస్తే వారం రోజులైనా దొరకలేదన్నారు. పైగా అక్కడ రూ.2 లక్షల విలువ చేసే గేదెలను రూ.4 లక్షలకు అంటగడుతున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు.