ఆదిలాబాద్లో నేనే పోటీలో పెట్టించా: ఈటల
ABN , First Publish Date - 2021-11-26T22:26:57+05:30 IST
రాష్ట్రంలో జరుగతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తానే పోటీలో పెట్టించానని ఆయన పేర్కొన్నారు. మీడియాతో జరిగిన చిట్చాట్లో ఎమ్మెల్యే ఈటల మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు.