అంబేడ్క‌ర్ భవన్ ను ప్రారంభించిన మంత్రులు కొప్పుల,ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-18T20:27:16+05:30 IST

జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేడ్క‌ర్ భవన్ ను ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

అంబేడ్క‌ర్ భవన్ ను  ప్రారంభించిన మంత్రులు కొప్పుల,ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్: జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో  నిర్మించిన  నూతన అంబేడ్క‌ర్ భవన్ ను ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ  శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ప్రారంభించారు.ఎక‌రం విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్య‌యంతో విశాల‌మైన భ‌వ‌నాన్ని నిర్మించారు. సుమారు 2 వేల‌ మంది కూర్చునేలా ఆడిటోరియంను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక చొరవ‌తో నిర్మ‌ల్ లో నిర్మించిన అంబేడ్క‌ర్ భ‌వ‌నం తెలంగాణ రాష్ట్రంలోనే మోడ‌ల్ గా నిల‌వ‌నుంది. ఈ సందర్భంగా మంత్రులిరువురూ మాట్లాడుతూ తెలంగాణలో దళితుల పురోభివ`ద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2022-04-18T20:27:16+05:30 IST