బాసర ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-03-03T20:10:33+05:30 IST
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిలాబాద్: రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసా దాలను అందజేసి, ఆశీర్వదించారు. మంత్రుల వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.