పనిచేస్తారా.. లేదా వెళ్తారా..: మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ
ABN , First Publish Date - 2021-07-11T01:30:03+05:30 IST
శానిటేషన్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అధికారులపై మంత్రులు
ఖమ్మం: శానిటేషన్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అధికారులపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలోని మంచుకొండ గ్రామంలో శానిటేషన్ పనులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్కుమార్ పరిశీలించారు. గ్రామాల్లో శానిటేషన్ అధ్వాన్నంగా ఉంది. దీంతో మంచిగా పనిచేస్తారా.. లేదా వెళ్తారా.. అంటూ జిల్లా పంచాయతీ అధికారిపై మంత్రులు మండిపడ్డారు. రఘునాథపాలెం మండలంలోని బుడిదంపాడులో మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని మంత్రులు సందర్శించారు.