సిరివెన్నెల సీతారామశాస్ర్తి మృతికి మంత్రుల సంతాపం

ABN , First Publish Date - 2021-12-01T01:31:56+05:30 IST

తెలుగు సినీ గేయ రచయిత చేంబోలు సీతారామశాస్త్రి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సిరివెన్నెల సీతారామశాస్ర్తి మృతికి మంత్రుల సంతాపం

హైదరాబాద్: తెలుగు సినీ గేయ రచయిత  చేంబోలు సీతారామశాస్త్రి  మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తూ సిరి వెన్నెల లా వెలిగిన సీతారామ శాస్త్రి కలం ఎన్నో అద్భుతమైన పాటలు జాలు వారాయన్నారు. ఆయన భావం, మాట, పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. నిందా స్థుతి చేసినా, ప్రేమ ఒలక బోసినా, జీవిత సత్యాలను నిష్టూరంగా చెప్పినా భావం ఏదైనా, పాట ఏదైనా అందులో సీతారామ శాష్ట్రి ముద్ర బలంగా ఉందన్నారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటని అన్నారు.

Updated Date - 2021-12-01T01:31:56+05:30 IST