దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి Vellampalli
ABN , First Publish Date - 2022-01-01T14:20:51+05:30 IST
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్శంగా మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మ దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని దేవస్థానం అధికారులు మంత్రి వెల్లంపల్లికి అందజేశారు.