చంద్రబాబు, పవన్ ఆర్య వైశ్య ద్రోహులు: మంత్రి Vellampalli

ABN , First Publish Date - 2022-03-17T15:37:08+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

చంద్రబాబు, పవన్ ఆర్య వైశ్య ద్రోహులు: మంత్రి Vellampalli

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లిఖార్జునరావును వేధించడంతో హఠాత్తుగా చనిపోయారన్నారు. చంద్రబాబు నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారని తెలిపారు. సొంత పార్టీలో ఉన్న శిద్దా రాఘవరావును అవమానాలకు గురి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిగా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్య ద్రోహులని వ్యాఖ్యానించారు. రోశయ్య బతికున్నప్పుడు చంద్రబాబు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. 

Updated Date - 2022-03-17T15:37:08+05:30 IST